Telangana
లాక్ డౌన్ తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలకు బోజన సదుపాయం
డయాసిస్ ఆఫ్ ఆదిలాబాద్ సంస్థ అధ్యక్షులు ప్రిన్స్ ఆంథోని

Umaads Raju ,Staff Repoter Manchirial , Kalinga Times : లాక్ డౌన్ దృష్టా ఇబ్బందులను ఎదుర్కొంటున్న పాదాచారులు, వలస కూలీలలు,నిరుపేదలకు పండ్లు,ఫలహారాలు,భోజన సదుపాయం కల్పిస్తున్నట్లు డయాసిస్ ఆఫ్ ఆదిలాబాద్ సంస్థ అధ్యక్షులు,ఆదిలాబాద్ మేత్రాసన పీఠాధిపతులు ప్రిన్స్ ఆంథోని తెలిపారు.మంచిర్యాల పట్టణం లోని బిషప్ హౌస్ ఆవరణలో నిత్య అన్నదానం నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. కరోనా విరుస్ సెకండ్ వేవ్ కారణంగా అనేక నిరు పేద కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందుల పలవుతున్నరన్నారు అలాంటివారికి మానవతా దృష్టితో ఈ సహాయ కార్యక్రమాలను చేపట్టామని ఆదిలాబాద్,నిర్మల్,కుమరంభీం,మంచిర్యాల జిల్లాల నిరుపేదలు వినియోగించుకోవాలని తెలిపారు.దీనికోసం సహాయ వాణిని ఏర్పాటు చేసినట్టు చెప్పారు.7207486965 కు ఫోన్ చేసి అవసరమైన సహాయాన్ని పొందవచ్చన్నారు.